2, అక్టోబర్ 2012, మంగళవారం

యస్వి రంగారావు

సామర్ల వెంకట రంగారావు గారు (SVR) 03 -07 -1918 న లక్ష్మినరసాయమ్మ,కోటేశ్వర రావు లు అనబడే దంపతులకు కృష్ణా జిల్లా లోని నూజివీడు లో జన్మించారు.స్వస్థలం కాకినాడ.తండ్రి excise inspector గా నూజివీడులోపని చేశారు. తల్లి వెంకటేశ్వర స్వామి వారి భక్తురాలు అవటం చేత కొడుకు కు వెంకట రంగారావు అనే పేరు పెట్టుకున్నారు.

ధనవంతులైన తల్లితండ్రులు ఇతనిని హై స్కూల్ విద్యకే మద్రాస్ పంపించారు.SVR తన 12 వ ఏటనే,హై స్కూల్ విద్య పూర్తి చేసి,B.Sc లో చేరారు. హై స్కూల్ విద్యార్ధి గా ఉన్నప్పటి నుంచి ఇతనికి కళలంటే ఎక్కువ మక్కువ.కాలేజీ లో చదువుకునేటప్పుడే,అతను తన నటనకు మెరుగులు దిద్దుకున్నాడు.డిగ్రీ పూర్తి అయిన తర్వాత,బందరు లో Fire Service డిపార్టుమెంటు లో వుద్యోగం సంపాదించారు.అప్పుడు ఆయన మదిలో రెండు ఆలోచనలున్దేవి, M.Sc లో చేరటమా లేక సినిమా రంగంలో నటుడిగా కృషి చెయ్యటమా! అని.వారి బంధువైన బి.వి.రామానందం గారు SVR ను సినీ రంగానికి ఆహ్వానించారు.ఆ సినిమా పేరు వరూధిని.రంగారావు గారు వెంటనే వుద్యోగం మానివేసి,సిని రంగం లో ప్రవేశించటానికి మద్రాస్ పయనమయ్యారు.వరూధిని అనుకున్నంత విజయం సాధించలేదు.అందుచేత కొంత కాలం వరకు వారికి సినిమాల లో వేషాలు వేసే అవకాశం రాలేదు.తర్వాత రంగారావు గారికి విసుగు పుట్టి,జంషెడ్పూర్ లో TATA వారి సంస్థలో కొన్నాళ్ళు వుద్యోగం చేశారు అయితే అతనికి నటన పైన వున్న ప్రేమ తొలగిపోలేదు,పైగా ఎక్కువ కూడా అయినది.

27 -12 -1947 న లీలావతి అనబడే కన్యామణి తో వీరి వివాహం జరిగినది.SVR గారికి తదుపరి రోజుల్లో 'పల్లెటూరిపిల్ల' అనే చిత్రం లోవిలన్ గా నటించటానికి శ్రీ బి.ఏ. సుబ్బారావు గారి నుండి ఆహ్వానం వచ్చింది.అయితే,దురదృష్టం ఏమిటంటే,వీరు మద్రాస్ వెళ్ళటానికి రైలు ఎక్కే సమయం లో,వారి నాన్న గారు స్వర్గస్తు లైనారని తంతి వార్త వచ్చింది.తండ్రి అంత్యక్రియలు పూర్తి చేసుకొని,మద్రాస్ వెళ్ళేటప్పటికి,ఆ వేషం మరొకరికి ఇవ్వబడింది.అదృష్టమేమంటే,విజయా వారి,కే.వి.రెడ్డి గారి దృష్టిలో పడటమే!పాతాళ భైరవి లో నేపాలీ మాంత్రికుడి వేషం వేసే ఛాన్స్ వచ్చింది.వచ్చిన ఆ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటమే కాకుండా,ఆయన ఆ పాత్ర పోషించిన తీరు పండిత పామరుల ప్రశంసలు అందుకుంది. ఇక విజయా వారికి ఈయన ఆస్థాన నటుడయ్యారు.ఆ తర్వాతనే విదులైన,విజయా వారి'పెళ్లి చేసి చూడు' సినిమాలో వీరు పోషించిన 'వియ్యన్న' పాత్ర కూడా నేపాలీ మాంత్రికుడి వేషం వలె తెలుగువారి గుండెల్లో చిరస్థాయి గా నిలిచిపోయింది.దాని తమిళ version లో కూడా అదే పాత్రను పోషించి, తమిళ ప్రజల మన్ననలను కూడా పొందారు.విజయా వారు మాయాబజార్ తీసే టప్పుడు, 'ఘటోత్కచుని' వేషానికి ముందుగా వీరిని తీసుకున్నారు.కే.వి.రెడ్డి గారు అన్నారుట'ఆ వేషానికి వేరే ఆప్షన్ లేదు' అని.మాయాబజార్ అంత రసవంతం గా తయారుకావటానికి ముఖ్య కారకులలో అతి ముఖ్యుడీయన!అలా నిర్విరామమగా వీరి నట యాత్ర తెలుగు ,తమిళ రంగాలలో కొనసాగింది.వీరు నటించిన నర్తనశాల లోని కీచకుని వేషానికి పలువురి ప్రశంసలు లభించింది.

సతీ సావిత్రి అనే సినిమా తీసేటప్పుడు ,చైనా ప్రధాని చౌ యెన్ లై ,వీరిని సెట్లో యముని వేషంలో చూసి ఆశ్చర్య చకితులయ్యారట!. జకార్తా లో జరిగిన ఇండోనేసియా ఫిలిం ఫెస్టివల్ లో,వీరి కీచకుని వేషానికి ఉత్తమ నటుని అవార్డు తో పాటుగా బంగారు పతకం కూడా దక్కింది.ముఖ్యం గా పౌరాణిక సినిమాలలో ప్రతి నాయకుడి గా నటించి తనదైన ఒక ప్రత్యేక బాణీ ని ప్రవేశపెట్టారు. రావణ బ్రహ్మ,దుర్యోధనుడు,హిరణ్యకశిపుడు .మాయల పకీరు,మున్నగు వేషాలు వీరిని తెలుగు ప్రేక్షకుల గుండెలపై చిర స్థాయి గా కూర్చో పెట్టాయి.సంభాషణల ఉచ్చారణ, పలికే విధానం,ఆ విరుపు,హావ భావాలు మరెవరి తరం కావు.యెంత మహా నటుడినైనా Dominate చేయ గల సత్తా సామర్ధ్యం వీరి సొంతం. వీరితో నటించాలంటే ఆనాటి అగ్రనటులు సైతం భయపడేవారు,ఒక్క సావిత్రి తప్ప!ఆయన సమకాలీనుడైన గుమ్మడి గారి మాటల్లో చెప్పాలంటే,ఇటువంటి నటుడు పొరపాటున మన దేశంలో పుట్టాడు,మరే దేంలో నైనా పుట్టివుంటే,ప్రపంచపు నటులలోనే మేటి నటుడయ్యే వాడు!ఇంతకన్నా గొప్ప అవార్డు,రివార్డ్ ఏమున్నది?

“బంగారు పాప” (1955) ఆర్ధికంగా విజయం సాధించక పోయినా మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఈ చిత్రంలో ఎస్.వి. రంగారావు నటనను,లండన్లో చూసిన చార్లీ చాప్లిన్, ఇలియట్ “బ్రతికి వుంటే చాలా సంతోషించి ఉండేవాడని” అన్నారు. (జార్జి ఇలియట్ రాసిన “సైలాస్ మార్నర్” అన్న ఆంగ్ల నవల 'బంగారుపాప'కు ఆధారం).

చాలా సాంఘీక,చారిత్రిక,పౌరాణిక సినిమా ల లో విభిన్న పాత్రలు పోషించి. తనకు తానే సాటి అని అనిపించుకున్నారు.రంగారావు గారు బంగారు పాప అనే సినిమాలో ఒక గుడ్డివాని వేషం వేస్తున్నారు,అదే సమయంలో NTR గారు చిరంజీవులు అనే సినిమాలో గుడ్డివాని వేషం వేస్తున్నారు.ఇద్దరూ కలిసి పొద్దున్నే,మద్రాస్ రైల్వే స్టేషన్ కి వెళ్లి, గుడ్డి వారి హావభాలు పరిశీలించేవారట! అలా సమాజంలో వున్న వ్యక్తులను పరిశీలించటం వల్లనే, వారి నటన అతి సహజం గా వుండేది!ఆ రెండు సినిమాలలో వారి నటన అందరి మన్ననలను పొందిన విషయం మనందరికీ తెలినదే!తెలుగులో NTR నటించిన'కథానాయకుడు సినిమా యెంత విజయం సాధించిందో మనందరికీ తెలిసిన విషయం.అందులో నాగభూషణం అద్భుతం గా నటించారు.అదే సినిమాను తమిళం లో మళ్ళీ తీసేటప్పుడు,నాగభూషణం వేసిన పాత్రను తమిళ సినిమాలో SVR వేశారు.ఆ సినిమా తెలుగులో కన్నా ఘనవిజయం సాధించింది,కేవలం SVR నటన వల్లనే!తమిళం కూడా అనర్గళం గా మాట్లాడే ఆయన,తమిళ సినిమాలలో నటించే టప్పుడు తమిళులు చాలామంది ,వీరు మా తమిలుడే అని భావించే వారట!అగ్ర నటులతో సమానంగా వీరు పారితోషికం తీసుకునే వారట!

వీరికి ముగ్గురు సంతానం.ఇద్దరు ఆడపిల్లలు(విజయ,ప్రమీల)ఒక కుమారుడు(కోటేశ్వర రావు).నిర్మాతగా కూడా మారి విజయవంతమైన నాదీ ఆడజన్మే! ,చదరంగ,బాంధవ్యాలు,సుఖదు:ఖాలు లాంటి సినిమాలను తీసారు.చదరంగం,బాంధవ్యాలు--సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు,పలు సంస్థల నుండి చాలా అవార్డ్స్,బిరుదులు పొందారు.
అకస్మాత్తుగా, తీవ్రమైన గుండెనొప్పి వచ్చి,ఉస్మానియా హాస్పిటల్ లో వైద్యం తీసుకునే సమయంలో,మళ్ళీ మరొక్కసారి గుండెనొప్పి చేత 18 -03 -1974 న తుది శ్వాసవిడిచారు.

WHY TO VISIT TEMPLES ? (Scientific Reason)


There are thousands of temples all over India in different size, shape and locations but not all of them are considered to be built the Vedic way. Generally, a temple should be located at a place where earth's magnetic wave path passes through densely. It can be in the outskirts of a town/village or city, or in middle of the dwelling place, or on a hilltop. The essence of visiting a temple is discussed here.

Now, these temples are located strategically at a place where the positive energy is abundantly available from the magnetic and electric wave distributions of north/south pole thrust. The main idol is placed in the core center of the temple, known as "*Garbhagriha*" or *Moolasthanam*. In fact, the temple structure is built after the idol has been placed. This *Moolasthanam* is where earth’s magnetic waves are found to be maximum. We know that there are some copper plates, inscribed with Vedic scripts, buried beneath the Main Idol. What are they really? No, they are not God’s / priests’ flash cards when they forget the *shlokas*. The copper plate absorbs earth’s magnetic waves and radiates it to the surroundings. Thus a person regularly visiting a temple and walking clockwise around the Main Idol receives the beamed magnetic waves and his body absorbs it. This is a very slow process and a regular visit will let him absorb more of this positive energy. Scientifically, it is the positive energy that we all require to have a healthy life.

Further, the Sanctum is closed on three sides. This increases the effect of all energies. The lamp that is lit radiates heat energy and also provides light inside the sanctum to the priests or *poojaris* performing the pooja. The ringing of the bells and the chanting of prayers takes a worshipper into trance, thus not letting his mind waver. When done in groups, this helps people forget personal problems for a while and relieve their stress. The fragrance from the flowers, the burning of camphor give out the chemical energy further aiding in a different good aura. The effect of all these energies is supplemented by the positive energy from the idol, the copper plates and utensils in the *Moolasthan*am / *Garbagraham*. *Theertham*, the “holy” water used during the pooja to wash the idol is not
plain water cleaning the dust off an idol. It is a concoction of Cardamom,*Karpura* (Benzoin), zaffron / saffron, *Tulsi* (Holy Basil), Clove, etc...Washing the idol is to charge the water with the magnetic radiations thus increasing its medicinal values. Three spoons of this holy water is distributed to devotees. Again, this water is mainly a source of magneto-therapy. Besides, the clove essence protects one from tooth decay, the saffron & *Tulsi* leafs protects one from common cold and cough, cardamom and *Pachha Karpuram* (benzoin), act as mouth fresheners. It is proved that *Theertham* is a very good blood purifier, as it is highly energized. Hence it is given as *prasadam* to the devotees. This way, one can claim to remain healthy by regularly visiting the Temples. This is why our elders used to suggest us to offer prayers at the temple so that you will be cured of many ailments. They were not always superstitious. Yes, in a few cases they did go overboard when due to ignorance they hoped many serious diseases could be cured at temples by deities. When people go to a temple for the *Deepaaraadhana*, and when the doors open up, the positive energy gushes out onto the persons who are there. The water that is sprinkled onto the assemblages passes on the energy to all. This also explains why men are not allowed to wear shirts at a few temples and women are requested to wear more ornaments during temple visits. It is through these jewels (metal) that positive energy is absorbed by the women. Also, it is a practice to leave newly purchased jewels at an idol’s feet and then wear them with the idol’s blessings. This act is now justified after reading this article. This act of “seeking divine blessings” before using any new article, like books or pens or automobiles may have stemmed from this through mere observation.

Energy lost in a day’s work is regained through a temple visit and one is refreshed slightly. The positive energy that is spread out in the entire temple and especially around where the main idol is placed, are simply absorbed by one's body and mind. Did you know, every Vaishnava(Vishnu devotees), “must” visit a Vishnu temple twice every day in their location. Our practices are NOT some hard and fast rules framed by 1 man and his followers or God’s words in somebody’s dreams. All the rituals, all the practices are, in reality, well researched, studied and scientifically backed thesis which form the ways of nature to lead a good healthy life.

The scientific and research part of the practices are well camouflaged as “elder’s instructions” or “granny’s teaching’s” which should be obeyed as a mark of respect so as to once again, avoid stress to the mediocre brains.

27, సెప్టెంబర్ 2012, గురువారం

జామ పండ్లు ఎక్కువగా తినండి...మీ ఆరోగ్యాన్ని బలపరుచుకోండి

మనం మన ఆరోగ్యాన్ని బలపరుచుకోవటానికి ఎంతో శ్రమ పడతాం. ఏన్నో ఆరోగ్య సూత్రాలను పాటిస్తాం. అందులో ఒకటి పండ్లు తినడం. ఐతే ఏ పండు తింటే మనం ఆరోగ్యాన్ని బలపరుచుకోవచ్చో మనకు ఖచ్చితంగా తెలియదు. మనకు నచ్చిన పండునో, లేక బలానా పండు ఆరోగ్యానికి మంచిదని ఎవరో చెబితేనో, ఎక్కడో చదివితేనో ఆ పండ్లను ఎక్కువగా వాడతూ ఉంటాము.

ఇక మీదట అలా చేయ వలసిన పని లేదు. పండ్లలోనే జామ పండు మన ఆరోగ్యాన్ని బలపరచటానికి ఎక్కువగా ఉపయోగ పడుతుందని హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ వారు పండ్ల మీద చేసిన పరిశోధనలో తెలిసింది.

ఎలాగంటే, మనం ఆరోగ్యంగా ఉండటానికి మనకు యాంటీ-ఆక్సిడెంట్స్ అతి ముఖ్యంగా కావలసి యున్నది. మన శరీరంలో యాంటీ-ఆక్సిడెంట్స్ ఎంత ఎక్కువగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాము.ఎందుకంటే వయసు పెరిగిన కొద్దీ మనలో ఉన్న కొన్ని జీవ కణాలు కూడా పాడవుతూ ఉంటాయి. యాంటీ-ఆక్సిడెంట్స్ ఈ జీవ కణాలు పాడైపోకుండా కాపాడతుంది. ఇంతే కాకుండా వయసుతో పాటు మనకు ఏర్పడే డీ-జెనరేటివ్ వ్యాధులనూ, క్యాన్సర్ వ్యాధినీ మరియూ ముసలితనాన్ని(Early Aging) అరికట్టడంలో సహాయపడుతుంది. కనుక ఈ యాంటీ-ఆక్సిడెంట్స్ మనకు చాలా అవసరమన్నమాట. అదీ ప్రక్రుతి ఆకారంలో దొరికితే చాలా మంచిది.




జామ పండులో యాంటీ-ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగానూ, పైనాపిల్ పండులో అతి తక్కువగానూ ఉన్నట్లు పరిశోధనలో తెలిసింది.

ఇండియన్ ప్లం, మామిడి పండు, దానిమ్మ పండు, సీతాఫలం మరియూ ఆపిల్ పండ్లలో యాంటీ-ఆక్సిడంట్స్ ఎక్కువగా ఉన్నదని పైనాపిల్,అరటి పండు, బొప్పాయి, పుచ్చకాయ మరియూ ద్రాక్ష పండ్లలో తక్కువగా ఉన్నదని తెలిపేరు.

ఖరీదైన పండ్లు ఆరోగ్యానికి మంచిదని అనుకుంటాము. కానీ తక్కువ ఖరీదు గల జామ పండు ఆరోగ్యానికి అతి మంచిదని తెలిసింది. ఈ క్రింది పట్టీలో ఏ ఏ పండ్లలో ఎంత శాతం యాంటీ-ఆక్సిడంట్స్ ఉన్నదో తెలుపబడింది.(100 గ్రాముల పండులో ఎన్ని మిల్లిగ్రాముల యాంటీ-ఆక్సిడంట్స్ ఉన్నదో తెలుపబడింది).

జామ పండు....496.
ఇండియన్ ప్లం....330
సీతాఫలం....202
మామిడి పండు....170
దానిమ్మ పండు....135
ఆపిల్ పండు....123
ద్రాక్ష పండు... 85
బొప్పాయ పండు....50
అరటి పందు....30
ఆరెంజ్ పండు...24
పుచ్చకాయ...23
పైనాపిల్....22

కనుక ఇక మీదట మీకు పండు తినాలనిపిస్తే జామ పండుకు మొదటి చాయిస్ ఇవ్వండి. మీ ఆరోగ్యాన్ని బలపరుచుకోండి.

15, సెప్టెంబర్ 2012, శనివారం

మెదడు యొక్క చురుకుదనాన్ని పెంచడానికి ఉపయోగపడే పండ్లు,కూరగాయలు....

మానవునిలో మెదడు జ్ఞానేంద్రియాలన్నింటికి ఇది ముఖ్యమైన కేంద్రం.మెదడుకు తనంతట తానే సొంతంగా మరమ్మతులు చేసుకోగలిగే సామర్థ్యం ఉందని మీకందరికీ తెలిసే ఉంటుంది. మెదడు చెప్పినవిధంగానే మన శరీరం నడుచుకుంటుంది. కాబట్టి మనం మెదడును చురుకుగా ఉంచుకున్నంతకాలం మన శరీరం చురుకుగా ఉంటుంది.వయసుతో మెదడుకు సంబంధంలేదు.

కూరగాయలు...

క్యారట్.....ఇది మనకి బీటాకరోటేన్ అనే ఎంజైం ను ఇస్తుంది.ఇందులో విటమిన్-ఏ ఎక్కువగా ఉన్నది.ఇది మన కళ్లకు మంచిది.కళ్లతో చూసేది మెదడుకు త్వరగా చేరుకుంటుంది.

టమేటో...అత్యధికమైన యాంటీ ఆక్సిడంట్స్ కలిగియున్నది.టమేటోలు మనకు విటమిన్-సి,విటమిన్-ఈ బీటాకరోటోన్ మరియూ మినరల్స్ & మాంగనీస్ ను అందిస్తుంది.

ఉల్లిపాయలు....రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్-సి ఇందులో అధికంగా ఉన్నది. అరుగుదలకు కావలసిన ఎంజైములను పెంచే మాంగనీస్,మాలిబ్ డెనం మరియూ హ్రుదయానికి కావలసిన విటమిన్లను అందిస్తుంది.

వంకాయలు...ఇది మెదడుకు కావలసిన ముఖ్యమైన ఆహారం. వంకాయ మీదున్న తొక్కులొ నాసునిన్ అనే యాంటీ-ఆక్సిడంట్ ఉన్నది. ఇది మెదడులో ఉన్న అతి సన్నని సెల్ పొరలను కాపాడుతుంది.

స్పినాచ్....శరీరం లోపల ఏర్పడే వాపులనూ, ఉత్తిడులనూ తగ్గిస్తుంది.విటమిన్-కే,మాంగనీస్, ఫోలేట్ మరియూ ఐరన్ చాలా ఎక్కువగా కలిగియున్నది.


పండ్లు...

ఏర్ర రంగు పండ్లు......ఏర్ర రంగు కలిగిన పండ్లు మరియూ కూరగాయలలో ప్రక్రుతి అందించిన వాటి రంగులలో లైకోపేన్ అనే ఎంజైము ఉన్నది. ఇది మనల్ని క్యాన్సర్ అపాయం నుండి రక్షిస్తుంది.టొమేటో,వాటర్ మెలాన్ లలో యాంటీ-ఆక్సిడన్ట్స్ ఎక్కువగా ఉన్నందున అవి మెదడును చురుకుగా ఉంచుతాయి.ఏర్ర స్ట్రాబెరీ లలు యాంతో సయానిన్స్ అనే ఎంజైం కలిగి ఉండటం వలన రక్త కనాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. రక్త కణాలు మెదడుకు మరియూ శరీరంలోని ఇతర అవయవాలకూ కావలసిన ఆక్సిజన్ అందిస్తాయి. కనుక ఇవి దెబ్బతినకుండా ఉంటే మనం ఎప్పుడూ చురుకుగా ఉండవచ్చు.ఆపిల్,బీట్రూట్,ఎర్ర క్యాబేజీ,చెర్రీ,దానిమ్మ లాంటి ఎర్ర రంగు పండ్లను ఎక్కువగా ఉపయోగించాలి.

ఆరెంజ్ మరియూ ఎల్లో రంగు పండ్లు.....ఈ రంగు పండ్లలో కరెటోనాయడ్స్ ఎంజైం కలిగి ఉంటుంది.చిలకడ దుంపలో బీటా కరోటిన్, పంప్ కిన్స్ మరియూ క్యారట్లలో విటమిన్-ఏ,విటమిన్-సి, ఫోలిక్ యాసిడ్,విటమిన్ బి-9 ఉండటం వలన మంచి ఎనర్జీ ఇస్తూ, ఒత్తిడ్లను తగ్గిస్తాయి. నిమ్మ పండు, మామిడి,ఆరెంజ్,పపాయి,పైనాపిల్,పంప్ కిన్,మొక్కజొన్న మరియూ చిలకడ దుంపలలో ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి.

గ్రీన్ రంగు పండ్లు....ఈ రంగు పండ్లలో క్లోరో ఫిల్ అనే ఎంజైం అధికంగా ఉంటుంది. ల్యూటైన్ మరియూ ఫోలేట్ అనే ఎంజైములు అధికం ఉండటం వలన ఈ రంగు పండ్లు మన కళ్లకు చాలా మంచిది. గ్రీన్ ఆపిల్,బీన్స్,క్యాబేజీ,కుకుంబర్,గ్రీన్ ద్రాక్ష,స్వీట్ లైం లాంటి వాటిలో ఇవి అధికముగా ఉంటాయి.

నీలం మరియూ పర్పుల్ రంగు పండ్లలో యాంటీ-ఆక్సిడంట్స్ ఎక్కువగా ఉంటాయి.ఇవి రక్త నాళాలను కాపాడతాయి.జ్ఞాపక శక్తిని పెంచుతాయి. ఎండు ద్రాక్ష, బ్లూ బెరీస్,ప్లం పండ్లలో ఇవి ఎక్కువగా ఉంటాయి. 

తెలుపు రంగు పండ్లు....ఈ రంగు పండ్లలో అల్లిసిన్ అనే ఎంజైం ఎక్కువగా ఉండటం వలన ఈ పండ్లు కొలెస్ట్రాల్ ను తగ్గించి రక్త పోటును కంట్రోల్లో ఉంచుతుంది.వీటిలో మినరల్ పొటాషియం కూడా ఎక్కువగా ఉన్నది.అరటి పండు,కాలీ ఫ్లవర్,వెల్లుల్లి,అల్లం,తెల్ల మష్రూం, ఉల్లిపాయలూ,బంగాలదుంప లలో ఇవి ఎక్కువగా ఉంటాయి.

14, సెప్టెంబర్ 2012, శుక్రవారం

మనల్ని ఉత్సాహ పరిచే కొన్ని ఆహారాలు...ఫోటోలు

మనందరికీ బద్దకమైన మనోభావం ఉంటుంది. చాలామందికి వారు తినే ఆహారాల(జంక్ ఫుడ్) వలన వారి ఆరొగ్యం మందగించి వారి బద్దకమైన మనోభావాన్ని మరింత ఎక్కువ చేస్తుంది. దీనికి ముఖ్య కారణాలు పోషకాహార లోపాలూ మరియూ డిప్రెషన్ వంటి మానసిక కారణాలు. డిప్రెషన్ అనేది మనం ఉత్సాహంగా లేకపోవడమే. ఇదే మనలోని ఉత్సాహాన్ని అనగద్రొక్కి బద్దకాన్ని ఎక్కువచేస్తుంది. కారణాలు ఏవైనా మనం మనలోని ఉత్సాహాన్ని పెంచుకోవాలి. మనలో ఉత్సాహాన్ని పెంచే ఆహార పధార్ధాలు ఉన్నాయని తెలిసినప్పుడు వాటిని మన ఆహారంలో చేర్చుకుంటూ మన ఆరోగ్యాన్ని పెంచుకుంటూ జీవితాన్ని ఎప్పుడూ ఉత్సాహంగా గడపాలి.

బచ్చలి కూర  మనం ఎక్కువగా వాడని ఈ బచ్చలి కూరలో మెగ్నీషియం చాలా ఉన్నది. మెగ్నీషియం ఒక ముఖ్యమైన పోషక పధార్ధం.శరీర జీవరసాయన ప్రక్రియలో మెగ్నీషియం ఉత్పత్తి అవుతుంది.ఆస్ట్రేలియాలో జరిపిన ఒక పరిశోధనలో మనలో మెగ్నీషియం తక్కువగా ఉంటే మనలో ఎక్కువగా బద్దకం చోటుచేసుకుంటుందని తెలిసింది.
డార్క్ చాక్లేట్  డార్క్ చాక్లెట్లు మెదడుకు వెళ్లే రక్త ప్రసారాన్ని ఎక్కువచేస్తుంది.దీని వలన మనలోని ఏకాగ్రత పెరుగుతుంది.ఏకాగ్రత మనలో ఉత్సాహాన్ని పెంచుతుంది. రోజుకు ఒక ఔన్స్ డార్ర్క్ చాక్లెట్ తినవచ్చు.
యోగర్ట్(పెరుగు)......దీనిలో ఎక్కువ కాల్షియం ఉన్నందువలన ఇది మనలో ఉత్సాహం పెరగటానికి కావలసిన న్యూరో ట్రాన్స్ మిటర్స్ ను ఉత్పత్తిచేస్తుంది.
అస్పార్గస్....ఇందులో ఫొలేట్ మరియూ ట్రిఫ్టోఫెన్ ఎక్కువగా ఉన్నది. ఇవి రెండూ కలసి సెరిటోనిన్ అనే ఎంజైమును ఉత్పత్తిచేస్తాయి. మనిషి ఉత్సాహంగా ఉండటానికి ముఖ్య కారణం సెరిటోనిన్. మన శరీరంలో సెరిటోనిన్ తగ్గితే మనలో ఉత్సాహం తగ్గుతుంది.
తేనె...ఇందులో కయింప్ ఫెరాల్ మరియూ క్వెర్టిసిన్ అనే ముఖ్యమైన ఎంజైములు ఉన్నాయి. ఇవి మనలో డిప్రెషన్ రాకుండా చూసుకుంటాయి.ఇంతే కాకుండా చెక్కరలగా ఇది మనకు ఎక్కువ క్యాలరీలు ఇవ్వకుండానే మనకు కావలసిన ఎనర్జీ ఇస్తుంది. మనం బరువు పెరగకుండా చేస్తుంది.
టమేటో....ఇందులో లైకోపీన్ అనే ఎంజైం ఎక్కువగా ఉన్నది. లైకోపీన్ ఒక ఆంటీ-ఆక్సిడంట్. ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. టమేటోలను ఆలివ్ నూనె తో కలిపి తింటే ఇంకా మంచిది. ఆలిఫ్ నూనె లైకోపీన్ రసాయన ప్రక్రియలో సహాయపడుతుంది.
కోడి గుడ్డు....ఇందులో జింక్, విటమిన్-బి, ఐయోడిన్, ఒమేగా-3 ఫాటీ ఆసిడ్ మరియూ ప్రొటీన్లు ఎక్కువగా ఉన్నాయి. ఇవి మనలో ఉతాహాన్ని పెరగడానికి సహాయపడతాయి.
కొబ్బరి.....కొబ్బరిలో మీడియం-చైన్ ట్రైగ్లిసరైడ్లు ఉన్నాయి. ఇవి మనలోని బద్దకాన్ని పోగొట్టి మన మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది.

11, సెప్టెంబర్ 2012, మంగళవారం

మీరు మెడికల్ షాపులో కొన్న మందులను సరిచూసుకోండి....అందరికీ ఉపయోగపడే సమాచారం

భారతదేశంలో కల్తీ మందులు రోగులను కాటేస్తున్నాయి. మెడికల్ షాపులు బినామీ పేర్లతోనే కొనసాగుతున్నాయి. దీంతో రోగులు జబ్బులు నయం కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వచ్చిన రోగం తగ్గకపోగా కల్తీ మందులతో కొత్త రోగాలబారిన పడుతున్నారు. డాక్టర్లు కూడా మెడికల్ షాపుల యజమానులతో కుమ్మక్కై సరైన మందులు అందించకుండా నకిలీ మందులను అందిస్తూ రోగుల నుంచి డబ్బులు దండుకొంటున్నారు.


మీరు భారదేశ మెడికల్ షాపులో కొన్న మందుల యొక్క నాణ్యత గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా( అంటే అవి కల్తీ మందులా/నకిలీ మందులా లేక నిజమైన నాణ్యత కలిగిన మందులేనా అని తెలుసుకోవడానికి).........నాణ్యత గల మందులను తయారుచేసే అన్ని ఒరిజినల్ కంపనీలూ తాము తయారుచేసిన మందు లేబుల్లపై ప్రత్యేకమైన (పై ఫోటోలో చూపినట్లు) నెంబర్లను ముద్రిస్తున్నారు. మీరు కొన్న మందుల నాణ్యత గురించి తెలుసుకోవాలంటే మీరు కొన్న మందు పై ముద్రించబడిన ప్రత్యేక నెంబర్ ను మీ మొబైల్ ఫోన్ నుండి 9901099010 కు మెసేజ్ చేయండి. వెంటనే మీరు కొన్న మందు యొక్క నాణ్యత గురించిన సమాచారం మీకు రిప్లై మెసేజ్ వస్తుంది.

ఈ విషయం గురించి మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే ఈ వెబ్ సైట్లకు వెళ్ళి తెలుసుకోవచ్చు.

http://www.pharmasecure.com
http://www.9901099010.com

ఈ విషయాన్ని మీకు తెలిసున్నవారందరికీ అందజేయండి.

3, జులై 2011, ఆదివారం

ఈ భావానికి అర్థం? - 2

జరిగిన కథ,...
తాగిన మైకం లో మాధవ్ తన ఫ్రెండ్ సంధ్య కి ఫోన్ చేసి ఏం మాట్లాడుతాడో మరిచిపోతాడు. తెలివి లోకి వచ్చాక సంధ్య కి ఫోన్ చేసినా కూడా తను కాల్ ఆన్సర్  చేయక పోయే సరికి, చాలా నీచంగా ఫీల్ అవుతూ, సంధ్య తో తన friendship గురించి గుర్తుచేసుకుంటూ ఉంటాడు.


అది దాదాపు మూడేళ్ళ క్రిందటి మాట, అప్పటికే సాఫ్ట్ వేర్ జాబు లో జాయిన్ అయి సంవత్సరం కావొస్తోంది మాధవ్ కి. వేసవి కాలం పూర్తి కావొస్తోంది.... మృగశిర కార్తె లోకి సూర్యుడు ప్రవేశించాడన్న మాటే కానీ,.. ఇంకా రోకళ్ళు సైతం పగిలి పోయే లా ఎండ కాస్తోంది. హైదరాబాద్ లో జనం నీటి కోసం ప్రైవేటు కంపెనీ ల కాన్  ల పై ఆధార పడుతూ, వర్షా కాలం లో వర్షం పడుతుంది అన్న సంగతి దాదాపు మరిచిపోయారు.

రోజు లాగే ట్రాఫ్ఫిక్  ని అంతా ఈదుకుంటూ ఆఫీసు చేరే సరికి మాధవ్ కి 10 దాటింది. పెద్దగా పనేమీ లేక పోవడం తో ఉదయం అంతా collegues  తో మాట్లాడుతూ, మీటింగ్స్ అటెండ్ అవుతూ,.. సరదాగా గడిపి లంచ్ కి వెళ్లి వచ్చాడు. system tray  లో టైం చూస్తే 3:18 pm అవుతోంది. ఉన్న issues అన్ని fix ఐపోయాయి. code release కూడా రేపే ఉండటం తో తనకి కొత్త implementations   కూడా మొదలు పెట్టబుద్ది కావట్లేదు. ఇక చేసేది లేక, reports అన్నీ రెడీ చేసి పెట్టి, లీడ్ కి మెయిల్  చేసేసి, నెట్ లో ఏదైనా online game ఆడదామని సెర్చ్  చేయసాగాడు.

ఒక్క గేమ్ కూడా interesting ఆ అనిపించట్లేదు. ఎలా అనిపిస్తాయ్, టీం  లో కొత్త గా జాయిన్  ఐన ట్రైనీస్ కూడా అమ్మాయిలని వేసుకుని తిరుగుతూంటే, వాళ్ళ ని చూసి ఈర్ష్య గా ఫీల్ అవడం తప్పితే, తనది ఎమీ చేయలేని పరిస్థితి మరి. అందునా కొత్తగా జాయిన్ ఐన batch  లో ఉన్న కావ్య ని చూసినప్పటి నుండి ఆ ఫీలింగ్  మరీ పెరిగిపోయింది. ఆ పిల్ల ని వాళ్ళ అమ్మా, నాన్నా ఏం పెట్టి పెంచారో కానీ,.. తనని చుసిన ప్రతీ సారీ తనకి,... రాజమౌళి సినిమా స్టూడెంట్. 1 లోని పాట గుర్తుకి వస్తుంది. వెంటనే ఆత్మా రాముడు ,"ఏమెట్టి.........ఏమెట్టి, చేసాడే .... ఓ భామా..నిను ఆ బ్రహ్మ!" అంటూ గుండెల్లో ఒకటే గోల.

మరో సారి ఆ కావ్య ని చూద్దాం అనిపించి ఒక్క సారి పక్క కి తిరిగి, చైర్ లోనే కూర్చుని వెనక్కి వంగాడు. తను కూర్చునే చోటు నుండి కొంచం వెనక్కి వచ్చి చూస్తే కొత్తగా జాయిన్  ఐన ట్రైనీస్ అందరూ కడపడతారు. అందులో లక్కీ గా కావ్య తనకి ఎదురుగానే కూర్చుంటుంది. తను ఏదో పని చేసుకుంటూ ఉన్నట్టుంది కాబోలు. ఆ అందానికి, మాధవ్ తను ఉన్నది ఆఫీసు  అని కూడా మరిచిపోయి అలా చూస్తూ ఉండిపోయాడు,.. చిరాకు తో వెనక్కి ముడేసినా కూడా తన పొడవైన వెంట్రుకలు, ఆమె మెడ దగ్గరే ఆగి, చెమట తో కొద్దిగా తడిచిన తన మెడ ని మరింత అందంగా కనపడేలా చేస్తున్నాయి!.. fluorescent bulbs వెలుగు లో తన మెడ మీది చెమట కుడా, మెరుస్తూ కనపడుతుంటే, ముడివేసిన జుట్టు లో నుండి అపుడపుడు కొన్ని వెంట్రుకలు జారి, ఆకర్షనీయంగా అలంకరించుకున్న తన చెవుల పై నాట్యం చేస్తున్నాయి. చిన్నిచిన్ని కళ్ళు, ఆ పై నునుపైన చెక్కిలి, సన్న ని ముక్కు, అక్కడి నుండి పెదాల దగ్గరకి వెళ్ళే దారి లో గర్వంగా కనపడుతున్న బ్యూటీ స్పాట్, ఓహ్ అందాలన్నీ ఏరి కోరి ఓ బొమ్మ పై అతికినట్టు గా ఉన్నాయ్. "దేవుడా!.. ఇలాంటి అందమైన అమ్మాయిలు ఎక్కడ పుడతారో, ఎవరితో క్లోజ్ గా ఉంటారో నాకైతే అస్సలు అర్థం కాదు!.." అనుకుంటూ పెద్దగా నిట్టూర్చి ఈ లోకం లోకి వచ్చాడు.

"ఛీ జీవితం, మహానుభావులు ఊరికనే అన్నారా? 95% of the women in this world are beautiful, remaining 5% are in my class, team, and life" అని. నేను జాబు లో జాయిన్ అయినపుడు ఇలా ఒక్క అమ్మాయి కూడా జాయిన్  అవలేదు." అని తన అదృష్టాన్ని మరో సారి తిట్టుకుని కంప్యూటర్  లో మొహం పెట్టి ఆలోచించ సాగాడు. పోనీ అన్ని లైట్  తీసుకుని ఈ అమ్మాయి కి సైట్ కోడదామంటే, తన seniority అడ్డం వస్తూంది తనకి. వ్యవహారం ఏమైనా చెడిందంటే, ఆఫీసు లో చులకన అయిపోతానేమో అని భయం. ఇంక లాభం లేదనుకుని, అన్నీ మూసుకుని, online లో ఎవరైనా కనపడతారేమో వెదుక్కుందామని, ఆర్కుట్  ఓపెన్ చేసాడు. ఒక్కరూ నచ్చట్లేదు తనకి. దానికి తోడు, online లో ఉన్న ఫ్రెండ్స్ లో ఒక్కడు కూడా respond అవట్లేదు. "అందరూ వాళ్ళ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ తో బిజీ గా ఉన్నట్టున్నారు, వెధవలు. ఇంకా మనతో ఎం మాట్లాడతారు? ఇంటికి వెళ్దామంటే ఇంకా బోల్డంత టైం ఉంది. ఇంకా ఈ వెదుకులాట ఎన్నాళ్ళో" అనుకుంటూ,.. కాఫీ తాగుదామనిపించి లేచాడు.

ఇంత లోనే, తన ఫోన్ మోగడం తో ఎవరా అని ఫోన్  స్క్రీన్  పై చూసుకుంటూ, కాఫెటేరియా  వైపు నడుస్తున్నాడు. స్క్రీన్  పైన శ్రీధర్ అని కనపడటం తో అప్పటి వరకు నిస్తేజంగా ఉన్న కళ్ళు ఒక్క సారిగా వెయ్యి వోల్ట్ ల కాంతి తో నిండిపోయాయి. కాఫీ ని పక్కన పడేసి, ఫోన్ ఆన్సర్ చేస్తూ lobby వైపు నడిచాడు మాధవ్. శ్రీధర్, తను ఇంజనీరింగ్ లో క్లాసు మేట్స్ బాగా క్లోజ్  ఫ్రెండ్స్. డిగ్రీ ఐపోయాక, మాధవ్ కి అక్కడే హైదరాబాద్ లోనే జాబు వచ్చింది, శ్రీధర్ కేమో ముంబై లో వచ్చింది. వృత్తి ధర్మం వారిద్దరినీ విడదీసినా, ఇంటర్నెట్  మాత్రం వారిద్దరి మధ్య దూరాన్ని ఎప్పుడూ పెరగనివ్వలేదు. ఈ సారి, శ్రీధర్ ఏమాత్రం చెప్పా పెట్టకుండా రావడం తో మాధవ్ బాగా surprising గా హ్యాపీ గా ఫీల్ అయ్యాడు.

శ్రీధర్ కి మళ్లీ రెండు రోజుల్లో వెళ్ళాల్సి ఉండటం తో, మరుసటి రోజు సాయంత్రమే కలవాలని నిర్ణయించుకున్నారు ఇద్దరూ.. office పని అంతా up to date గా ఉండటం తో, మాధవ్ కూడా సంతోషంగా సరే అనేసి,... మళ్లీ తన cabin కి దారి తీసాడు. బహూశా, మరుసటి రోజు close friend ని కలుస్తున్నానన్న ఆనందం తో అనుకుంటా,.. అప్పటి వరకి మాధవ్ కళ్ళలో ఉన్న నీరసం ఒక్క సారిగా మాయమైపోయింది. హుషారుగా ఏదో పాట hum చేసుకుంటూ, system లో log in అయ్యాడు. అప్పటికే సాయంత్రం ఆరు దాటడం తో,.. హమ్మయ్య! దరిద్రం వదిలింది రా బాబు anukuni, అన్నీ పక్కన పడేసి, system ని lock చేసి,.. ఇంటి దారి పట్టాడు.

శ్రీధర్ కి మాధవ్ కి మధ్యన రహస్యాలు అంటూ ఏమీ ఉండవు, అమ్మాయిల విషయం దగ్గరి నుండి professional life వరకు అన్నీ మాట్లాడుకుంటారు. ఇన్నాళ్ళు ఎంత online chat చేస్తున్నా, దాదాపు సంవత్సర కాలం తరువాత కలుస్తూండటం తో రేపటి గురించే ఆలోచిస్తూ నిద్ర లోకి జారుకున్నాడు మాధవ్.
***
మధ్యాహ్నం నాలుగు దాటింది. Office room అంతా centralized a.c. ఐనా,... మాధవ్ కి మాత్రం పిచ్చి కంపరంగా ఉంది. దానికి కారణం ఒక బగ్. ఆ బగ్  ని ఈ రోజు ఉదయమే testing team report చేసింది, అది కూడా high priority issue లాగా, బహూశా release కి ఒక్క రోజే సమయముండటం వల్ల ఆ bug priority పెరిగింది అనుకుంటా!.. ఆ బగ్ కి reason ఏంటో ఎంత ఆలోచించినా మాధవ్ కి తట్టడం లేదు. నిన్న సాయంత్రం వరకి బాగా ఉన్న code కి sudden గా ఏమొచ్చిందో, ఏమో, ఉదయం test చేస్తుంటే సరిగా work అవడం లేదు. ఇప్పటికే ఎన్నో సార్లు debug చేసాడు కాని ఫలితం లేక పోయింది. ఆ bug చాలా random గా వస్తుండటం తో దాని roots కనుక్కోవడం చాల కష్టంగా మారింది తనకి. ఎవైనా పెద్ద changes చేస్తే application execution తన్నేస్తోంది. ఏం చేయాలో తెలీక తల పట్టుక్కూచున్నాడు..

పదే పదే system tray లో time వైపు చూస్తూ, అసహనం గానే code కి changes చేయసాగాడు, ఐనా కూడా same problem. ఒకవైపు సమయమేమో మించి పోతోంది....సాయంత్రం 7:30 కి శ్రీధర్ ని కలవాలి. ఇక్కడ అమీర్ పెట్  నుండి కుకట్ పల్లి వెళ్లి వాణ్ణి కలవాలి అంటే ఎంత లేదన్నా గంట పడుతుంది. ఈ బగ్ ఫినిష్ చేస్తే కాని వెళ్ళడానికి వీల్లేదు అని వాళ్ళ ప్రాజెక్ట్ లీడ్ చెప్పాడు. trail and error లో దాదాపు అన్ని combinations try చేస్తున్నాడు, కాని ఒక్కటీ work అవడం లేదు. తల రాత అంటే ఇదేనేమో అనుకుని తన అదృష్టాన్ని తిట్టుకుంటూ, చివరి ప్రయత్నంగా ఒక సారి కోడ్ లో ప్రతీ statement ని conditioned compiling లో పెట్టి మళ్ళీ project build ఇచ్చి నిస్సహాయంగా compiling window వైపు చూడసాగాడు.

దాదాపు 20 నిముషాలు పాటు ఎలాంటి error report చేయకుండా build అవుతుండటం తో,.. హమ్మయ్య! అనుకుని relaxed గా నిట్టూర్చాడు మాధవ్. zero errors తో project build అవడం తో error ని retest చేసాడు. ఫస్ట్ టైం బానే పనిచేసింది కాని,.. వరుసగా రెండు మూడు సార్లు try చేస్తే మళ్లీ తన్నేస్తోంది. ఇంక లాభం లేదనుకుని,.. ఏదైతే అది అవుతుంది అని ప్రాజెక్ట్ లీడ్ ని, బగ్ ని పిచ్చ లైట్  తీసుకుని, error fix ఐనట్టు స్టేటస్  update  చేసేసి,.. ఆ కోడ్  నే repository  లోకి commit చేసి శ్రీధర్ ని కలవడానికి బయలుదేరాడు.

ఎలాగోలా,.. ట్రాఫ్ఫిక్ ని తప్పించుకుంటూ కుకట్ పల్లి  చేరుకునే సరికి, 7:30 దాటింది. ఇంక వాడితో తిట్లు తప్పవు అనుకుంటూ వాళ్ళు ఎపుడూ కలిసి కూర్చునే ఐస్ క్రీం పర్లోర్ ముందు బైక్ పార్క్ చేసి, లోపలి కి వెళ్ళాడు. ఇద్దరు మగాళ్ళు కలిసి ఐస్ క్రీం పర్లోర్ లో కూర్చోవడం ఏంటి, ఇదేం పోయేకాలం అనుకుంటున్నారా? వాళ్ళు అలా కూర్చోడానికి ఒక కారణం ఉంది, మాధవ్ డ్రింక్ చేస్తాడు కాని, శ్రీధర్ చేయడు, అందువల్ల ఇద్దరూ ఎప్పుడు కలిసినా ఏ restaurant కో, ఏ ఐస్ క్రీం పర్లోర్ కో వెళ్తుంటారు. అప్పటికే, ఒక కార్నెర్ టేబుల్ లో శ్రీధర్ ఒక్కడే కుర్చుని ఏదో ice క్రీం తింటూ వెయిట్ చేస్తున్నాడు. ఇంక మాధవ్ ని చూసి చూడగానే.. బండ బూతులు తిట్టి,.. ఆప్యాయంగా లేచి హాగ్ చేసుకున్నాడు. కాసేపు పిచ్చా పాటి మాట్లాడుకున్నాక, వాళ్ళ టాపిక్ గర్ల్ ఫ్రెండ్స్ పైకి మళ్ళింది.

మాధవ్ కి గర్ల్ ఫ్రెండ్స్ అంటూ పెద్దగా ఎవరూ లేరు. ఎవరితో కూడా 2, 3 నెలలకి మించి close గా మాట్లాడలేడు,.. ఏదో ఒక విషయం లో గొడవ పెట్టుకుని, పక్కన పెట్టేస్తాడు. ఆ విషయం శ్రీధర్ కి కూడా తెలుసు. కాని తను మాట్లాడిన అన్ని రోజులు మాత్రం అందరి కళ్ళలో పడతాడు. ఎవరికీ తెలీకుండా relation  ని మైంటైన్ చేయడం మాధవ్ కి దాదాపు గా తెలీని పని. కాని శ్రీధర్ అలాక్కాదు, కూల్ & కాం  గా ఎలాంటి హడావిడి లేకుండా,.. అమ్మాయిలతో మాట్లాడేస్తుంటాడు. అందువలనే కాబోలు, కాలేజీ  లైఫ్  లో చాలా మంది కి మాధవ్ అంటే కొంచం bad impression ఉండేది. మాధవ్ వచ్చిందగ్గరి నుండి "ఏరా ముంబై  లో ఎవరైనా అమ్మాయిలు close అయ్యా రా?" అని ఒకటే అడిగి అడిగి చంపుతున్నాడు శ్రీధర్ ని. అపుడు చెప్పాడు తను, సంధ్య గురించి. తను చాల అందంగా ఉంటుంది అని, మంచి అమ్మాయి అని, బాగా మాట్లాడుతుంది అని, ముంబై లోనే సెటిల్ ఐన తెలుగు ఫ్యామిలీ అని చెప్పాడు. వాళ్ళింటికి కూడా చాల సార్లు వెళ్లానన్నాడు. ఏంటి రా ప్రేమా అని చావ కొట్టాడు శ్రీధర్ ని మాధవ్. "వాడు సిగ్గు పడుతూనే అలా ఏమి లేదురా మంచి ఫ్రెండ్ అంతే" అన్నాడు, అలా ఐతే మాకైన పరిచయం చేయ వచ్చు కద రా, అంత అందగత్తె అంటున్నావ్, కొంచం మా జీవితాల్లో కూడా వెలుగు నింప ర బాబూ అని అడిగాడు. దానిదేముంది రా online లో పరిచయం చేయిస్తా లే... ఏం మట్లడుకుంటావో మాట్లడుకో అని సులువుగా అనేసాడు శ్రీధర్. ఆ రోజు రాత్రి వరకి అలా నే మాట్లాడుకుంటూ బాగా టైం స్పెండ్ చేసి ఇద్దరు ఎవరి ఇంటికి వాళ్ళు బయలు దేరారు.
***
మధ్యాహ్నం రెండున్నర గంటలు కావొస్తోంది. ఎవరో పిలిచినట్టు అనిపించి కళ్ళు తెరిచి చూసాడు మాధవ్, తన రూమ్మేట్ కిరణ్ తినమంటూ లేపుతున్నాడు. ఆకలి గా లేకున్నా రాత్రి మల్లి గ్యాస్ స్టేషన్ కి వెళ్ళాల్సి ఉండటం తో, ఏదైనా కొంచం తినేసి వచ్చి పడుకుందాం అని లేచి హాల్ లోకి నడిచాడు. నిన్నటి రాత్రి తాగేసి పడేసిన బాటిల్స్, స్నాక్స్ ఇంకా హాల్ లో అలానే ఉండటం తో, గది అంతా చెడు వాసన తో నిండి పోయింది. అసలు తినే ఓపికే లేదు మాధవ్ కి. ఎక్కడా నిల్చోలేక పోతున్నాడు, కళ్ళ ముందు ఉన్న టీవీ, టేబుల్ అన్ని కదులుతూ కనిపిస్తున్నాయి తనకి. శరీరం అంతా వేడి గా అనిపిస్తుంది. నోరంతా ఇంకా చేదు గానే ఉంది, బీర్ ఫ్లవొర్ ఇంకా పోలేదు కాబోలు అనుకుని, అన్నం పెట్టుకున్నాడు కాని అస్సలు సహించట్లేదు. కాని ఏదో కొంచమైనా తినాలి లేక పొతే హాంగ్ఓవర్  పోదు అనిపించి, మజ్జిగ తో ఏదో తినేసి వెళ్లి మళ్లీ పడుకున్నాడు. నిద్ర రావడం లేదు కాని.. లేచి కూర్చునే ఓపిక లేదు. ఇంకా సంధ్య తో ఏం మాట్లాడానో అనే ఆలోచనలే చుట్టు ముడుతున్నాయ్.

మాధవ్ ని, సంధ్య తనతోమాట్లాడదేమో అన్న భయం కన్నా, తను ఎందుకు మాట్లాడట్లేదు అన్న ప్రశ్నే ఎక్కువగా చంపేస్తూంది. మాధవ్ తనని అంత లా ఇష్ట పడతాడు. . తన స్నేహాన్ని ఇలా cheap గా behave చేసి మాత్రం వదులుకోలేడు. అందుకే ఆమె ఆలోచనలు అంత గా చుట్టుముడుతున్నాయి తనని....కళ్ళు మూసినా తెరిసినా అదే ప్రశ్న మది ని తోలిచేస్తూంది... తన మౌనం కన్నా మరణమే భారంగా తోస్తూంది తనకి.
(సశేషం)